
మహిళల కన్నెర్ర
● హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
● అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ
మహిళా విభాగం నేతల వినతి పత్రం
అనకాపల్లి టౌన్: అత్యాచారాలపై మహిళలు కన్నెర్ర చేశారు.. అరాచకాలు నశించాలని నినదించారు.. దిగజారిన శాంతిభద్రతలు కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లిలో నిరసన ప్రదర్శన జరిగింది. రింగ్రోడ్లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా రైల్వేస్టేషన్ జంక్షన్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేశారు. పార్టీ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు శోభ హైమావతి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలపై అత్యారారాలు పెరిగిపోయాయని, మూడు సంవత్సరాల పిల్లల నుంచి, ముసలివాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నా రు. ప్రశాంతమైన రాష్ట్రం అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళా హోం మంత్రి ఉన్నా అతివలపై దాడులను అరికట్టలేకపోతున్నారని విమర్శించారు. మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని అమలు చేస్తే.. దాని పేరు మార్చి మహిళలకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పంచారీ పద్మ, అనకాపల్లి మండల మహిళా అధ్యక్షురాలు కోట్నాల పద్మకుమారి, పెందుర్తి మహి ళా విభాగం అధ్యక్షురాలు ఎస్.నదియా, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.