
కేజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ వాణి బాధ్యతల స్వీక
మహారాణిపేట: కేజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రసూతి, సీ్త్ర వ్యాధుల విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఐ.వాణి సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ పోస్టు అదనపు డీఎంఈ కేడర్లో ఉండటంతో.. అదే కేడర్కు చెందిన డాక్టర్ వాణిని నియమిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న డాక్టర్ పి.శివానంద్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ, డిప్యూటీ సీఎస్ఆర్ఎంవో డాక్టర్ జి.మెహర్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ డి.రాధాకృష్ణన్, డాక్టర్ వి.రవి, డాక్టర్ ఎల్.లోకనాథ్ రావు, డాక్టర్ జి.వాసవి లత, అసిస్టెంట్ డైరెక్టర్ బి.ఎస్.సుమతితో పాటు ఇతర వైద్యులు, పరిపాలన సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ వాణి మాట్లాడుతూ రోగులకు మెరుగైన సంరక్షణ, ఉన్నతమైన చికిత్స ప్రమాణాలు అందించడమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. కేజీహెచ్ ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు, అవసరమైన సంస్కరణలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటానన్నారు.