
ఢిల్లీ సందర్శించిన నలుగురు విద్యార్థులు
మాడుగుల రూరల్: సృజనవాణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మండలంలో వీరవల్లి అగ్రహారం విద్యార్థులు ఢిల్లీ సందర్శించారు. అక్కడ సమీపంలో రిషిహుడ్ విశ్వవిద్యాలయంలో పర్సనాలిటీ డెవలప్మెంటుపై శిక్షణ తీసుకున్నారు. ఫ్లై ఇన్ ది స్కై సూపర్ 60 రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులు కె. కల్పన(చోడవరం), ఎం. రోహిత్కుమార్ (వీరనారాయణం), కె.మోహిత, ఎం. గౌతమి( కె.జె.పురం) ఎంపిక చేశారు. ఈ నెల ఒకటో తేదీన ఇక్కడ నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లారు. ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపుదల వంటి అంశాల్లో శిక్షణ పొందారు. ఇందులో భాగంగా అక్షరధామ, లోటస్పాండ్, ఢిల్లీ గేట్, పార్లమెంటు భవనంతో పాటు పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అక్కడ నుంచి నేరుగా విమానంలో విశాఖకు సోమవారం తిరిగి వచ్చారు. వీరి వెంట సృజనవాణి స్వచ్ఛంద సంస్థ కార్యనిర్వాహక సభ్యుడు పి. మహేశ్ వెళ్లారని సంస్థ సమన్వయకర్త జానీ సోమవారం తెలిపారు.
రిషిహుడ్ విశ్వవిద్యాలయంలో పర్సనాలిటీ డెవలప్మెంటుపై శిక్షణ