ఇసుక ట్రాక్టర్ల యజమానులపై బైండోవర్‌ కేసులు | - | Sakshi
Sakshi News home page

ఇసుక ట్రాక్టర్ల యజమానులపై బైండోవర్‌ కేసులు

Jun 11 2025 8:44 AM | Updated on Jun 11 2025 8:44 AM

ఇసుక ట్రాక్టర్ల యజమానులపై బైండోవర్‌ కేసులు

ఇసుక ట్రాక్టర్ల యజమానులపై బైండోవర్‌ కేసులు

దేవరాపల్లి: తిమిరాంలో భారీ గోతులు తీసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు సాక్షి పత్రికలో ఈ నెల 9న ‘ఇసుక తోడేళ్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. శారదానదిలో నిబంధనలకు విరుద్ధంగా గోతులు తీసి ఇసుక తరలిస్తున్న ముగ్గురు ట్రాక్టర్‌ యజమానులు సబ్బవరపు రామకృష్ణ, సీముసిరి గంగునాయుడు, గుంపాన గంగునాయుడులపై స్థానిక తహసీల్దార్‌ బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. ఉచిత ఇసుక పేరిట నిబంధనలను అతిక్రమించి ఇసుక తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ పి.లక్ష్మీదేవి హెచ్చరించారు.

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల బదిలీ

విశాఖ లీగల్‌ : నగరంలోని పలువురు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ బి.రామకోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం మొబైల్‌ కోర్టు ఏపీపీ పి.శాంతి గౌతమి భీమిలి 16వ ప్రధాన శ్రేణి న్యాయస్థానం అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. పాడేరు మెజిస్ట్రేట్‌ కోర్టు ఏపీపీ వీ. రమేష్‌, భీమిలి 14వ ప్రధమ శ్రేణి మేజిస్ట్రేట్‌ కోర్ట్‌ ఏపీపీగా వస్తున్నారు. నగరంలోని ఒకటవ ప్రధాన మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఏపీపీ ఎం షణ్ముఖ ఎకై ్సజ్‌ కోర్టు ప్రత్యేక ఏపీపీగా నియమితులయ్యారు. ఎక్సైజ్‌ కోర్టు ఏపీపీ కె విమల్‌ రాథోడ్‌, ఫస్ట్‌ ఏసీ ఎం కోర్టు ఏపీపీగా వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement