మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్‌కే.. | - | Sakshi
Sakshi News home page

మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్‌కే..

Jun 10 2025 7:02 AM | Updated on Jun 10 2025 7:02 AM

మళ్లీ

మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్‌కే..

తుమ్మపాల: పొంతన లేని సమాధానాలతో పీజీఆర్‌ఎస్‌ అర్జీదారులను అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ అర్జీదారులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యానికి గురై ఏర్పడిన సమస్యలపై కలెక్టరేట్‌లో మొరపెట్టుకుంటే జిల్లా అధికారులు సైతం అదే ధోరణి చూపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థపై క్రమేపి ప్రజల్లో నిరాశ వ్యక్తమవుతోంది. పీజీఆర్‌ఎస్‌ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు అధికారులు ఎండార్స్‌మెంట్లు ఇస్తూ వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. దీంతో రెవెన్యూ సంబంధిత భూ సమస్యలు తప్ప ఇతర సంక్షేమ పథకాలు, వ్యక్తిగత అవసరాలకు సంబంధించి వాటిపై విన్నవించేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి సంఖ్య క్రమేపి తగ్గుతూ వస్తోంది. ఈ సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో 122 అర్జీలు రెవెన్యూ సంబంధిత అంశాలివే వచ్చాయి. పంచాయతీ రాజ్‌ – 32, సర్వే శాఖ –18, పోలీస్‌ –17, మరో 17 శాఖల్లో ఒకటి, రెండేసి అర్జీలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం 240 అర్జీలు రాగా, అధిక సంఖ్యలో ఫిర్యాదులు పునరావృతమైనవే ఉన్నాయి.

● కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారుల వద్ద కలెక్టర్‌ విజయకృష్ణన్‌తోపాటు డీఆర్వో వై.సత్యనారాయణరావు, ఎస్‌డీసీలు సుబ్బలక్ష్మి, మనోరమ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

సమస్య పరిష్కారం కాక..

వస్తున్న అర్జీదారులు

మండల అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆవేదన

కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో

240 అర్జీల నమోదు

పాసుపుస్తకాలు మంజూరు చేయలేదు

డీ–పట్టా భూమిని ఆన్‌లైన్‌ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ పాయకరావుపేట మండలం కుమారపురం గ్రామానికి చెందిన గురుబిల్లి రాంబాబు అర్జీ చేసుకున్నాడు. తన అత్తగారైన కర్రి లక్ష్మి ద్వారా సంక్రమించిన డీపట్టా భూమి నేటికీ ఆన్‌లైన్‌ కాకపోవడంతో ప్రభుత్వ పథకాలు, సహాయం పొందలేక పోతున్నానని మొరపెట్టుకున్నాడు. వృద్ధాప్యంతో ఉన్న తనకు పాసుపుస్తకాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరాడు.

మెట్టింట్లో కూతురు ఉద్యోగం చేస్తే పింఛన్‌ రాదంట!

వృద్ధాప్యంతో ఒంటరిగా జీవిస్తున్న తనకు ప్రభుత్వ పింఛన్‌ మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని గవరపాలెం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన జల్లూరి గొంతమ్మ పీజీఆర్‌ఎస్‌లో అర్జీ పెట్టుకుంది. పట్టణంలో 23వ గ్రామ సచివాలయానికి పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పొయిందని వాపోయింది. పింఛన్‌ ఇస్తామంటూ ఇన్నాళ్లు తిప్పించుకుని, వివాహమైన కూతురు పేరు రేషన్‌ కార్డులో ఉందని, ఆమె ఉద్యోగం చేస్తున్నందున పింఛన్‌ రాదని ఇప్పుడు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒంటరిగా జీవిస్తున్న తనకు వివాహమై వెళ్లిపోయిన కూతురు వివరాలు జోడించి అన్యాయం చేయొద్దని, కలెక్టరమ్మ స్పందించి పింఛన్‌ మంజూరు చేయాలని ఆమె వేడుకుంది.

మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్‌కే.. 1
1/2

మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్‌కే..

మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్‌కే.. 2
2/2

మళ్లీ.. మళ్లీ కలెక్టరేట్‌కే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement