నేడు, రేపు సౌకర్యంకేంద్రాలు పనిచేస్తాయి

విశాఖ: జీవీఎంసీ పరిధిలో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేందుకు అనువుగా గురు, శుక్రవారాల్లో అన్ని సౌకర్యం కేంద్రాలు తెరిచే ఉంటాయని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ పన్నులు చెల్లించేందుకు అన్ని జోన్లలోని సౌకర్యం కేంద్రాలు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై వడ్డీ మినహాయింపు ప్రకటించిన నేపథ్యంలో నగర వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆస్తిపన్ను వడ్డీ రాయితీతో చెల్లించేందుకు ఈ నెల 31తో గడువు ముగుస్తుందని.. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు ఆస్తి పన్నును చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని సూచించారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top