న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి: ధర్మశ్రీ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి: ధర్మశ్రీ

Mar 26 2023 2:14 AM | Updated on Mar 26 2023 2:14 AM

చోడవరం బార్‌ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ 
 - Sakshi

చోడవరం బార్‌ నూతన కార్యవర్గాన్ని సత్కరించిన ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ

చోడవరం: న్యాయవాదుల సమస్యల పరిష్కారా నికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరం బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులంతా కొత్త అధ్యక్షుడు కాండ్రేగుల డేవిడ్‌ ఆధ్వర్యంలో శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ధర్మశ్రీ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కొత్త కార్యవర్గం బార్‌ సంక్షేమానికి మరింతగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే న్యాయవాదులకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. పార్టీ నాయకులు బొడ్డేడ సూర్యనారాయణ, శరగడం చిమ్మినాయుడు, కురుకూటి భోగేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement