గంజాయి సాగు నిర్ధారణకు డ్రోన్‌తో సర్వే | - | Sakshi
Sakshi News home page

గంజాయి సాగు నిర్ధారణకు డ్రోన్‌తో సర్వే

Sep 18 2026 1:03 AM | Updated on Sep 18 2026 1:03 AM

కొయ్యూరు: గంజాయి సాగు నిర్థారణ కోసం గురువారం మంప ఎస్‌ఐ సీదరి శ్రీనివాస్‌ డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించారు. బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని అన్నవరం, కన్నవరం, గరిమండ, కిన్నెర్లబంధ, గొర్లెమెట్ట గ్రామాల్లో డ్రోన్‌ ఉపయోగించి ఈ సర్వే చేపట్టారు. గతంలో ఈ గ్రామాల్లో గంజాయి సాగు చేసేవారు కాగా, నాలుగేళ్ల కిందట పోలీసులు గంజాయి తోటలను ధ్వంసం చేసి హెచ్చరించడంతో గిరిజనులంతా సాగును పూర్తిగా నిలిపివేశారు. తాజాగా ఈ ఐదు గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో ఎక్కడా గంజాయి సాగు చేయడం లేదని స్పష్టమైన నిర్ధారణకు వచ్చారు. గంజాయికి బదులుగా గిరిజనులు కాఫీ, రాజ్‌మా, తీపి మొక్కజొన్న తదితర లాభసాటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. గంజాయి సాగవుతుందో లేదో పరిశీలించేందుకు డ్రోన్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేపట్టామని, ఎక్కడా గంజాయి సాగు లేదని తెలిపారు. గిరిజన రైతులు ప్రత్యామ్నాయంగా మంచి లాభాలు వచ్చే వాణిజ్య పంటలు వేస్తుండడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement