సత్యసాయి సేవా సంస్థల సేవలు విస్తృతం | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి సేవా సంస్థల సేవలు విస్తృతం

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

అనకాపల్లి: సత్యసాయి సేవా సంస్థల సేవలు మరింత విస్తృతం చేయాలని ఆ సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. స్థానిక గవరపాలెం గౌరీగ్రంథాలయం ఆవరణలో జిల్లా సత్య సేవా సంస్థల జిల్లా కన్వీనర్లతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యసాయి 101వ జయంతి సందర్భంగా ఈ ఏడాది భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సమితి పరిధిలో మొక్కలను నాటాలన్నారు. నారాయణ సేవ, మెడికల్‌ క్యాంపులు, దుప్పట్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది నవంబర్‌ 23వ తేదీన సాయిబాబా శత జయంతి నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు, ప్రతినిధులు కామరాజు, మూర్తి, గౌరీ, విద్యా, బీవీపీ మహేశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement