సీలేరు: స్థానిక శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ధ్యాన మందిరం నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన దాత ప్రదీప్ రెడ్డిని ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. బెంగళూరుకు చెందిన ప్రదీప్ రెడ్డి, సీలేరులోని ఈ పురాతన ఆలయ పునర్నిర్మాణ సమయంలో ధ్యాన మందిర నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఆయన తన ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. ఈ నేపథ్యంలో, ఆలయ వార్షిక మహోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు వైదారాజు. వీవీ సత్యనారాయణ, శేఖర్, సత్యనారాయణ, బాబి సత్కరించారు.


