పరిమితికి మించి ప్రయాణికులు
మండలంలోని గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు, బరడ పంచాయతీలకు తారు రోడ్లు వేసినా, నేటికీ ప్రైవేట్ జీపులు, ఆటోలే దిక్కవుతున్నాయి.
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల గిరిజనులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు.
ప్రభుత్వం స్పందించి ముంచంగిపుట్టు నుంచి లక్ష్మీపురం, బరడ మీదుగా బుంగాపుట్టు వరకు తక్షణమే ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని స్థానికులు కోరుతున్నారు. – ముంచంగిపుట్టు


