కొనసాగుతున్న చలిగాలులు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న చలిగాలులు

Jan 4 2026 7:08 AM | Updated on Jan 4 2026 7:08 AM

కొనసాగుతున్న చలిగాలులు

కొనసాగుతున్న చలిగాలులు

ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీల నమోదు

చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా చలిగాలులు కొనసాగుతున్నాయి. శనివారం ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీలు, జి మాడుగులలో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

● పాడేరు డివిజన్‌ పరిధి అరకువ్యాలీలో 9.4 డిగ్రీలు, హుకుంపేట, పెదబయలులో 10.9 డిగ్రీలు, పాడేరులో 11.7 డిగ్రీలు, చింతపల్లిలో 13.2 డిగ్రీలు, కొయ్యూరులో 14.7 డిగ్రీలు, అనంతగిరిలో 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్‌ పేర్కొన్నారు.

పోలవరరం జిల్లాలో

పోలవరం జిల్లాలో రంపచోడవరం డివిజన్‌ మారేడుమిల్లిలో 12.5 డిగ్రీలు, వై.రామవరంలో 13.1 డిగ్రీలు, రంపచోడవరంలో 16.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 16.5 డిగ్రీలు, అడ్డతీగలలో17.4 డిగ్రీలు, చింతూరు డివిజన్‌ పరిధి చింతూరులో 16.8 డిగ్రీలు, ఎటపాకలో 17.6 డిగ్రీలు నమోదు అయినట్లు ఏడీఆర్‌ వెల్లడించారు.

రాజవొమ్మంగి: మండల ప్రజలు చలితీవ్రతకు వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

జి.మాడుగుల: మండలంలో చలితీవ్రత కొనసాగుతోంది. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు, నుర్మతి, సోలభం, కుంబిడిసింగి, లువ్వాసింగి రోడ్లలో శనివారం ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు అలుముకున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement