వణికిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

Dec 31 2025 7:16 AM | Updated on Dec 31 2025 7:16 AM

వణికిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

వణికిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

● జి.మాడుగులలో 7.0 డిగ్రీల నమోదు

చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి తీవ్రతకు మన్యం వాసులు వణికిపోతున్నారు. మంచు ప్రభావం ఎక్కువగానే ఉంది. మంగళవారం జి.మాడుగులలో 7.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.

●పాడేరు డివిజన్‌ పరిధి ముంచంగిపుట్టులో 7.8 డిగ్రీలు, డుంబ్రిగుడలో 8.2 డిగ్రీలు, చింతపల్లిలో 10.8 డిగ్రీలు, పాడేరులో 11.3 డిగ్రీలు, కొయ్యూరులో 13.0 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.

రంపచోడవరం డివిజన్‌ వై.రామవరంలో 11.2 డిగ్రీలు, మారేడుమిల్లిలో 14.0 డిగ్రీలు, రంపచోడవరంలో 14.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.9 డిగ్రీలు, అడ్డతీగలలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్‌ ఎటపాక, చింతూరులో 15.3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్‌ పేర్కొన్నారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు స్వల్పంగా ఉన్నప్పటికీ శీతల గాలుల ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉదయం 10 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement