ఆర్టీసీ బస్సు ఢీకొనిచుక్కల జింక మృతి
ఆరిలోవ (విశాఖ) : జాతీ య రహదారిపై బుధవా రం జరిగిన రో డ్డు ప్రమాదంలో ఓ చుక్కల జింక మృతి చెందింది. అటవీశాఖ సిబ్బంది తెలిపిన వివరాలివి. కంబాలకొండ అభయారణ్యం నుంచి ఓ చుక్కల జింక జూపార్క్ దాటిన తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో నగరం నుంచి మధురవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ జింకను ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం జూ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దహనం చేశారు.


