అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు

Dec 10 2025 7:46 AM | Updated on Dec 10 2025 7:46 AM

అప్పన

అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు

సహస్రనామార్చన నిర్వహిస్తున్న అర్చకుడు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం సహస్రనామార్చన జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలను పఠిస్తూ స్వామికి తులసితో అర్చన చేశారు. విశేష హారతులు అందించారు.

వైభవంగా నిత్యకల్యాణం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.

అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు 1
1/1

అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement