దట్టంగా మంచు, చలి
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలతోపాటు చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది. బుధవారం డుంబ్రిగుడలో 14.3 డిగ్రీలు, అరకువ్యాలీలో 14.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అదికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి ముంచంగిపుట్టులో 15.1 డిగ్రీలు, పెదబయలులో 15.6 డిగ్రీలు, జి.మాడుగులలో 15.8 డిగ్రీలు, హుకుంపేటలో 15.8 డిగ్రీలు, పాడేరులో 16.1డిగ్రీలు, చింతపల్లిలో 17.0 డిగ్రీలు, కొయ్యూరులో 18.3 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు.
● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 17.6 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 18.7 డిగ్రీలు, అడ్డతీగలలో 18.9 డిగ్రీలు, మారేడుమిల్లిలో 19.1డిగ్రీలు, రంపచోడవరంలో 20.3 డిగ్రీలు, గంగవరంలో 23.3 డిగ్రీలు, చింతూరు డివిజన్లో చింతూరులో 20.6 డిగ్రీలు, ఎటపాకలో 22.6 డిగ్రీలు నమోదు అయ్యాయని ఏడీఆర్ పేర్కొన్నారు. ఇలావుండగా చలిగాలుల తీవ్రత నెలకొంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు.
కొనసాగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు


