వణుకుతున్న మన్యం
● పెరుగుతున్న తీవ్రత
● వీస్తున్న శీతల గాలులు
● అరకువ్యాలీలో 8.5 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ మళ్లీ మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఉదయం 9 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం నుంచి శీతల గాలులు వీస్తున్నందున చలి విజృంభిస్తోంది. గురువారం అరకువ్యాలీలో 8.65 డిగ్రీలు, జి మాడుగులలో 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి ముంచంగిపుట్టులో 9.5, డుంబ్రిగుడలో 9.7,పెదబయలులో 10.3,హుకుంపేటలో 10.6, పాడేరులో 10.8, చింతపల్లిలో 12.5, అనంతగిరిలో 13.4, కొయ్యూరులో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ తెలిపారు.
● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 13.2, మారేడుమిల్లిలో 15.9, అడ్డతీగలలో 16.9, రాజవొమ్మంగిలో 16.9 , రంపచోడవరంలో 17.7, గంగవరంలో 20.4, చింతూరు డివజన్లో చింతూరులో 18.0 , ఎటపాకలో 19.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు.
వణుకుతున్న మన్యం


