వణుకుతున్న మన్యం | - | Sakshi
Sakshi News home page

వణుకుతున్న మన్యం

Nov 28 2025 9:09 AM | Updated on Nov 28 2025 9:09 AM

వణుకు

వణుకుతున్న మన్యం

పెరుగుతున్న తీవ్రత

వీస్తున్న శీతల గాలులు

అరకువ్యాలీలో 8.5 డిగ్రీల

కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ మళ్లీ మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఉదయం 9 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. సాయంత్రం నుంచి శీతల గాలులు వీస్తున్నందున చలి విజృంభిస్తోంది. గురువారం అరకువ్యాలీలో 8.65 డిగ్రీలు, జి మాడుగులలో 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌/వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ అప్పలస్వామి తెలిపారు.

● పాడేరు డివిజన్‌ పరిధి ముంచంగిపుట్టులో 9.5, డుంబ్రిగుడలో 9.7,పెదబయలులో 10.3,హుకుంపేటలో 10.6, పాడేరులో 10.8, చింతపల్లిలో 12.5, అనంతగిరిలో 13.4, కొయ్యూరులో 14.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్‌ తెలిపారు.

● రంపచోడవరం డివిజన్‌ వై.రామవరంలో 13.2, మారేడుమిల్లిలో 15.9, అడ్డతీగలలో 16.9, రాజవొమ్మంగిలో 16.9 , రంపచోడవరంలో 17.7, గంగవరంలో 20.4, చింతూరు డివజన్‌లో చింతూరులో 18.0 , ఎటపాకలో 19.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్‌ పేర్కొన్నారు.

వణుకుతున్న మన్యం1
1/1

వణుకుతున్న మన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement