గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
పెందుర్తి: ఓ గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడ్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గతేడాది జూలైలో ఏజెన్సీ నుంచి నగరానికి గంజాయి తరలిస్తుండగా పెందుర్తి పోలీసులు మాటు వేసి సరిపల్లి వద్ద పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో అల్లూరి జిల్లా ముంచంగిపుట్టుకు చెందిన పంగి గోవింద్(30) తప్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఏజెన్సీ ప్రాంతంలో సంచరిస్తున్న అతడిని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు.


