చికిత్స పొందుతూ యువకుడు మృతి
రాజవొమ్మంగి: రాజవొమ్మంగికి చెందిన అబ్దుల్ (22) ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. స్థానిక కిరాణ వ్యాపారి దావూద్ కుమారుడైన అబ్దుల్ ఆదివారం మోటారుబైక్పై రాజవొమ్మంగి శివారులో వెళ్తూ, వాహ నం అదుపుతప్పి ఓ గూడ్స్ వ్యాన్ ఢీ కొట్టాడు. ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. ఆయన హుటాహుటిన స్థానిక పీహెచ్సీకు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ సిఫార్సు చేశా రు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పొందుతూ అబ్దుల్ మృతి చెందాడు. అందరి అభిమానం పొందిన అబ్దుల్ మృతి చెందడంతో స్థానికంగా విషాదం అలముకొంది. అబ్దుల్ మృతదేహానికి స్థానికులు నివాళులర్పించారు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి


