విద్యా ప్రగతిని పెంచేందుకు నాణ్యమైన బోధన | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రగతిని పెంచేందుకు నాణ్యమైన బోధన

Sep 18 2025 7:05 AM | Updated on Sep 18 2025 7:05 AM

విద్యా ప్రగతిని పెంచేందుకు నాణ్యమైన బోధన

విద్యా ప్రగతిని పెంచేందుకు నాణ్యమైన బోధన

చింతపల్లి: విద్యార్దులకు విద్యాప్రగతిని పెంచే విధంగా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన చేయాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ వి.రామస్వామినాయుడు అన్నారు. తాజంగి కస్తూర్బా పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని అంచనా వేసేందుకు ఎఫ్‌ఎ బుక్‌లెట్‌లను సమీక్షించారు. బోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాద్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి సామార్థ్యానికి తగ్గట్టుగా అభ్యసించేలా తరగతులను నిబద్దతో నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలలో భోజన సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థుల విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ వంటి అంశాలను చర్చించారు. ప్రిన్సిపాల్‌ మాధురి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement