
ఆదర్శనీయుడు మోక్షగుండం
ఇంజనీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ఇంజినీర్లు
సీలేరు: దార్శనికుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీర్లందరికీ ఆదర్శనీయుడని ఏపీ జెన్ కో సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం సీలేరు గెస్ట్ హౌస్లో ఇంజినీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం సాగు,తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈఈ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేసి, వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామంటే దానికి మోక్షగుండం కారణమని చెప్పారు. ఏడీలు వై.శ్రీధర్ కుమార్, ఏ.ఎస్.ఆర్.జైపాల్, అప్పారావు శ్రీనివాసు, ఏఈఈ సురేష్, నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను సత్కరించారు.

ఆదర్శనీయుడు మోక్షగుండం