ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం

Sep 11 2025 2:43 AM | Updated on Sep 11 2025 2:43 AM

ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం

ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం

అడ్డతీగల: ఆలయాల్లో నిత్య ధూప ధీప నైవేద్యాలు జరగాలని షణ్ముక పీఠాధిపతి స్కంద స్వామీజీ అన్నారు. అడ్డతీగలలోని పవనగిరి క్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్‌లోని 70 గ్రామాలకు షణ్ముకపీఠం తరఫున ఆలయ అర్చకులకు పూజా ద్రవ్యాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన అర్చకులకు పూజాద్రవ్యాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్కంద స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవాలని కోరారు. పవనగిరి క్షేత్రం వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య సూచనల మేరకు పూజాద్రవ్యాలను అందజేశామన్నారు. తణుకు వెంకటరామయ్య, విజయలక్ష్మి దంపతులు, షణ్ముక పీఠం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement