ప్రమాద స్థాయికి డుడుమ, జోలాపుట్టు | - | Sakshi
Sakshi News home page

ప్రమాద స్థాయికి డుడుమ, జోలాపుట్టు

Jul 29 2025 7:24 AM | Updated on Jul 29 2025 7:56 AM

ప్రమా

ప్రమాద స్థాయికి డుడుమ, జోలాపుట్టు

ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి నీరందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు జలాశయాల్లోకి వచ్చి చేరుతోంది. డుడుమ జలశయం నీటి మట్టం 2,590 అడుగులు కాగా సోమవారం నాటికి 2,585.90 అడుగులుగా నమోదైంది. డుడుమ జలశయ ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటి మట్టం సైతం క్రమేపి పెరుగుతోంది. జోలాపుట్టు జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా సోమవారం నాటికి 2,738 అడుగులకు చేరింది.గత ఏడాది ఇదే రోజు 2,732 అడుగులు నీటి నిల్వ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఆరు అడుగులు నీటి నిల్వ ఎక్కువగా ఉంది. జలాశయాల్లోకి వరదనీరు భారీగా చేరుతుండడంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది నిరంతరం నీటి నిల్వలు అంచనా వేస్తున్నారు.

సరిహద్దులో విస్తారంగా వర్షాలు

జలాశయాల్లోకి భారీగా వరద నీరు

అప్రమత్తమైన జలాశయాల అధికారులు

ప్రమాద స్థాయికి డుడుమ, జోలాపుట్టు 1
1/1

ప్రమాద స్థాయికి డుడుమ, జోలాపుట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement