మీకోసంలో 128 వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

మీకోసంలో 128 వినతుల స్వీకరణ

Jul 12 2025 8:15 AM | Updated on Jul 12 2025 10:05 AM

మీకోసంలో 128 వినతుల స్వీకరణ

మీకోసంలో 128 వినతుల స్వీకరణ

పాడేరు : స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 128 వినతులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఇంచార్జీ డీఆర్వో, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. సంబంధిత శాఖ అధికారులు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జనార్దనరావు, జిల్లా ట్రెజరీ అధికారి ప్రసాదరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రమేష్‌కుమారరావు, డీఎల్‌పీవో కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement