రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 24 2025 1:21 AM | Updated on May 24 2025 1:21 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొయ్యూరు: మండలంలోని నడింపాలెం వంతెన వద్ద గరువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.మాకవరానికి చెందిన కొర్రు ప్రకాషరావు(53) చింతలపూడిలో ఓ వివాహానికి వెళ్లి తిరిగి స్వగ్రామం వెళుతుండగా ఆయన నడుపుతున్న ద్విచక్రవాహనం నడింపాలెం వంతెన వద్ద అదుపు తప్పి,వంతెన ఊచను ఢీ కొంది. ఈ ప్రమాదంలో ప్రకాషరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కిషోర్‌వర్మ తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement