పోలవరం నిర్వాసితులకు భూసేకరణపై అభిప్రాయసేకరణ | - | Sakshi
Sakshi News home page

పోలవరం నిర్వాసితులకు భూసేకరణపై అభిప్రాయసేకరణ

May 10 2025 7:57 AM | Updated on May 10 2025 8:00 AM

పోలవరం నిర్వాసితులకు భూసేకరణపై అభిప్రాయసేకరణ

పోలవరం నిర్వాసితులకు భూసేకరణపై అభిప్రాయసేకరణ

రాజవొమ్మంగి: పోలవరం నిర్వాసితుల కోసం భూ సేకరణలో భాగంగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం అభిప్రాయ సేకరణ జరిగింది. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ( పోలవరం) వీరాంజనేయుడు, తహసీల్దార్‌ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి, దూసరపాము, తంటికొండ, జడ్డంగి రైతులతో సమావేశం అయిన అధికారులు భూమి అమ్మేందుకు సుముఖంగా ఉన్న వారు తెలియజేయాలని వారు కోరారు. కొనుగోలు చేసిన భూమికి సముచితమైన ధర ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. అనంతరం స్పెషల్‌ డిప్యూటి కలెక్టర్‌ రామాంజనేయులు విలేకరులతో మాట్లాడారు. రైతులనుంచి అభిప్రాయాలు సేకరించామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement