
రోడ్డు ప్రమాదంలోమరో వ్యక్తి మృతి
వై.రామవరం: వ్యాన్పై నుంచి జారిపడిన ప్రమాదంలో గాయపడిన మండలంలోని పి.యర్రగొండ గ్రామానికి చెందిన మరో వ్యక్తి పల్లాల శ్రీనివాసరెడ్డి(26) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్టు ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపారు. ఇదే ప్రమాదంలో గాయపడిన కిచ్చలి రామకృష్ణారెడ్డి(36) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మండలంలోని రాచపాలెం గ్రామ సమీపంలో ఈనెల 28న వ్యాన్పై నుంచి రోడ్డుపై జారిపడి మండలంలోని పి. యర్రగొండ గ్రామానికి చెందిన వీరిద్దరూ తీవ్రగాయాలపాలవడంతో స్థానిక సీహెచ్సీకి, అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనంతరం శనివారం శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.