
ప్రతి కార్డుదారునికిరేషన్ అందించాలి
● కలెక్టర్ దినేష్కుమార్
సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి రేషన్కార్డుదారునికి రేషన్బియ్యం,ఇతర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పౌరసరఫరాలశాఖ అఽధికారులను ఆదేశించారు.పట్టణంలోని సుండ్రుపుట్టు డీఆర్ డిపోలో రేషన్కార్డుదారులకు మంగళవారం కలెక్టర్ బియ్యం,పంచదార పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్వో బి.గణేష్కుమార్,తహసీల్దార్ వి.త్రినాథరావునాయుడు,పౌర సరఫరాలశాఖ డీటీ ప్రశాంత్,జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు.