
శిశు మరణాలపై విచారణ
రాజవొమ్మంగి: మండలంలోని మొల్లిమెట్ల, వాతంగి గ్రామాల్లో రెండు రోజుల వ్యవధిలో సంభవించిన శిశు మరణాలపై రంపచోడవరం ఏడీఎంఅండ్హెచ్వో శిరీష బుధవారం విచారణ జరిపారు. ‘శిశువు మృతి– సకాలంలో అందని వైద్యం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆమె స్పందించా రు. లాగరాయి, జడ్డంగి, రాజవొమ్మంగి పీహెచ్సీలను బుధవారం సందర్శించిన ఆమె ఆపరేషన్ థియేటర్లో పరికరాలు శుభ్రతగా లేకపోవడంపై ఆమె అసహ నం వ్యక్తం చేశారు. శిశువు మృతి చెందిన మొల్లిమెట్ల గ్రామానికి వెళ్లారు. రామిరెడ్డి, శిరీష దంపతులకు చెందిన మూడు నెలల చిన్నారి మృతిపై వివరాలు తెలుసుకున్నారు. జ్వరం, ఫిట్స్ రావడంతో చిన్నారి అస్వస్థకు గురైందని, చికిత్స అందించే లోగా మృతి చెందిందని వారు వివరించారు. శిశు మరణంపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏడీఎంహెచ్వో తెలిపారు. అనంతరం ఆమె సిబ్బందితో సమీక్షించారు. అప్పుడే పుట్టిన బిడ్డలు అనారోగ్యానికి గురికాకుండా అంగన్వాడీ వర్కర్లు, పీహెచ్సీ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని కోరారు. సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఆమె వెంట లాగరాయి, రాజవొమ్మంగి పీహెచ్సీల వైద్యాధికారులు నాగార్జున, సుష్మ తదితరులు పాల్గొన్నారు.
వివరాలు సేకరించిన
ఏడీఎంహెచ్వో శిరీష

శిశు మరణాలపై విచారణ