క్షయ పట్ల అప్రమత్తత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

క్షయ పట్ల అప్రమత్తత తప్పనిసరి

Jun 5 2025 7:58 AM | Updated on Jun 5 2025 7:58 AM

క్షయ పట్ల అప్రమత్తత తప్పనిసరి

క్షయ పట్ల అప్రమత్తత తప్పనిసరి

పాడేరు : క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెంటనే సమీక్ష ఆస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌బాషా సూచించారు. మండలంలోని మారుమూల ఈదులపాలెం పీహెచ్‌సీలో బుధవారం నిర్వహించిన క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవోడీటీ డాక్టర్‌ సూర్యనారాయణమ్మ, ఎంవోటీసీ డాక్టర్‌ రేఖ, పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ శ్రీను, డాక్టర్‌ నర్సింగ్‌, ఆశా కార్యకర్తలు, స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హుకుంపేట: గిరిజన గ్రామాల్లో సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో జమాల్‌బాషా సూచించారు. బుధవారం ఆయన స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో తప్పనిసరిగా రక్తపరీక్షలు చేయాలన్నారు. అనంతరం కొట్నాపల్లి, పెదగరువు గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన సందర్శించి పలు సూచనలు చేశారు. స్థానిక వైధ్యాధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో డాక్టర్‌ జమాల్‌బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement