
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
పాడేరు : పీఎం జన్మన్ పథకంలో ఆదివాసీ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి బాబు ఆదేశించారు. మండలంలోని వంతాడపల్లి పంచాయతీ అల్లివరం, సప్పిపుట్టు ఆదివాసీ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆదివాసీలు చేపడుతున్న గృహ నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి సకాలంలో బిల్లుల చెల్లిస్తామని ఆయన తెలిపారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయన వెంట హౌసింగ్ ఏఈ ఈశ్వర్రావు తదితరులు ఉన్నారు.