
వేంకటేశ్వరునికి అభిషేక పూజలు
రంపచోడవరం: మండల పరిధి ఐ.పోలవరం కొండపై వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారికి శుక్రవారం అభిషేక సేవలను ఆలయ అర్చకులు గోవర్థన్, శ్రీ మణికంఠాచార్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ డీఎఫ్వో టి.అనూష మాట్లాడుతూ టీటీడీ ఆలయ ప్రాంగణంలో మొక్కలు పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో శ్రీవారి అన్నదాన సమితి సేవకులు గురుప్రసాద్, కందుల రాంబాబు తదితరుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించినట్టు ఆలయ అధికారి నారాయణరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త నల్లమిల్లి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.