
గర్భిణులకు నిలిచిన అల్ట్రాసౌండ్ పరీక్షలు
ముంచంగిపుట్టు: స్థాస్థానిక సీహెచ్సీలో గత ఏడు నెలలుగా అల్ట్రాసౌండ్ పరీక్షలు నిలిచిపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళ, గురు వారాల్లో సీహెచ్సీలో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ టెస్ట్లు చేసి గర్భంలో శిశువు పరిమాణం, హృదయ స్పందన, శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తారు. శిశువు ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యం అందిస్తారు. ఇలా ఎంతో కీలకమైన అల్ట్రాసౌండ్ పరీక్షలు ఇక్కడ గైనికాలజిస్ట్ లేక జరగడం లేదు. గతంలో గైనకాలజిస్ట్ పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి ఇక్కడి వచ్చి సేవలు అందించేవారు. నవంబర్ నుంచి గైనకాలజిస్ట్ లేకపోవడం గర్భిణుల వైద్య సేవలపై తీప్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడి వైద్యుల సూచనల మేరకు ప్రతి వారం సుమారు 60 మంది గర్భిణులు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నెలల తరబడి గర్భిణులు ఇబ్బందులు పడుతున్నా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారుల్లో ఏమాత్రం చలనం ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. స్థానిక సీహెచ్సీపై వారి పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి గైనకాలజిస్ట్ నియామకానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ముంచంగిపుట్టు సీహెచ్సీలో
గైనకాలజిస్ట్ లేక ఇబ్బందులు
ఏడు నెలలుగా ఇదే దుస్థితి
పట్టించుకోని వైద్యవిధాన పరిషత్
ఉన్నతాధికారులు