● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం ఎదురుచూస్తున్న గిరిజనం ● సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ పట్టని చంద్రబాబు ● 56,491 మంది సొంతింటి ఆశలపై నీళ్లు | - | Sakshi
Sakshi News home page

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం ఎదురుచూస్తున్న గిరిజనం ● సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ పట్టని చంద్రబాబు ● 56,491 మంది సొంతింటి ఆశలపై నీళ్లు

Jun 7 2025 1:30 AM | Updated on Jun 7 2025 1:30 AM

● మూడ

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం ఎదురుచూస్తున్న గిరిజనం

సాక్షి, పాడేరు: పేదలకు రెండు నుంచి మూడు సెంట్ల ఇంటి స్థలం.. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థికసాయం.. సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది. అధికారం చేపట్టి ఏడాదైనా గిరిజనులకు కనీసం సెంటు భూమి కూడా ఇవ్వలేదు. ఆదివాసీలకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం జన్‌మన్‌ పథకం మినహా మిగిలిన గిరిజన జాతుల పేదలకు ఇళ్లు మంజూరు చేయలేదు.

దరఖాస్తుదారులకు నిరాశ

కూటమి ప్రభుత్వ హామీలు నమ్మి ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు నిరాశే మిగిలింది. రాష్‌ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో గృహ నిర్మాణశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. 22 మండలాల పరిధిలో 56,491 మంది పేద కుటుంబాలను గుర్తించారు. కాలనీ ఇళ్లు మంజూరు అవుతాయని పేదలు ఎంతో ఆశతో ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది.

గుడిసెల్లో దుర్భర జీవనం

సొంతిల్లు లేక మట్టి గుడిసెల్లో పలు జాతుల గిరిజనులు దుర్భర జీవనం సాగిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అనంతగిరి మండలం బల్లగరువు గ్రామాన్ని సందర్శించారు. కూలే దశలో ఉన్న గుడిసెల్లో జీవనం సాగిస్తున్న గిరిజనుల దుర్భర జీవనాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. ఈ ప్రాంతానికి ఎగువున ఉన్న గుమ్మంతి, గుమ్మంతి కాలనీల్లో గిరిజనులు సొంతంగా మట్టిగోడలతో నిర్మించిన గుడిసెలే దర్శనమిస్తున్నాయి. గిరిశిఖర గ్రామాల్లో పేదల పరిస్థితి సొంతిల్లు లేక మరింత దయనీయంగా ఉంది.

బిల్లుల చెల్లింపులో జాప్యం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరైన పీఎంఏవైతో పాటు పీఎం జన్‌మన్‌ ఇళ్ల నిర్మాణాలకు సకాలంలో బిల్లులు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2023–24లో 17వేలు పీఎంఏవై, 8787 పీఎం జన్‌మన్‌ ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే 2024–25లో కేంద్ర ప్రభుత్వం పీవీటీజీ గిరిజనులకు 16,791 పీఎం జన్‌మన్‌ ఇళ్లను మంజూరు చేసింది. అయితే పాత, కొత్త ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిల్లుల చెల్లింపు ఆలస్యమవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.

అనంతగిరి మండలం బల్లగరువులో పక్కా ఇళ్లకు నోచుకోని గిరిజనుల మట్టి గుడిసెలు

ఒక ఇల్లూ ఇవ్వలేదు

స్థలం ఉన్నందున కాలనీ ఇల్లు మంజూరు చేయాలని పలుసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మా గ్రామ పర్యటన సమయంలో కొత్త ఇళ్లకోసం సర్వే చేశారు. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. మట్టిగోడలు, శిథిలమైన రేకుల గుడిసెల్లో ఇబ్బంది పడుతూ కాలం గడుపుతున్నాం. ఇవి ఎప్పుడు కూలిపోతాయేనని భయంగా ఉంది.

– చింత గంగమ్మ, బల్లగరువు, పినకోట పంచాయతీ,

అనంతగిరి మండలం

బిల్లులు చెల్లించాలి

పీఎం జన్‌మన్‌ పథకంలో పక్కా ఇల్లు నిర్మించుకుంటున్నాం. జరిగిన పనులకు తగ్గట్టుగా ప్రభుత్వం బిల్లులు వెంటనే చెల్లించకపోవడంతో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. రెండవ దశలో రూ.90వేల బిల్లు చెల్లింపు పెండింగ్‌లో ఉంది. బిల్లులు వెంటనే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలుకుంటే వర్షాకాలం ముందే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తాం

– వంతాల లక్ష్మణరావు, డల్లాపల్లి, పాడేరు మండలం

గుడిసెలకు పరిమితం

రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయకపోవడంతో మా బతుకులు గుడిసెలకు పరిమితమయ్యాయి. మట్టిగోడలతో సొంతంగా గుడిసెలను నిర్మించుకున్నాం. వర్షాలు కురిసినప్పుడల్లా భయం భయంగా జీవనం సాగిస్తున్నాం. పక్కా ఇళ్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికార యంత్రాంగం దృష్టి సారించి కాలనీ ఇళ్లు మంజూరు చేయాలి. – కొర్రా మల్లన్న, గుమ్మంతి, అనంతగిరి మండలం

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం  ఎదురుచూస్తున్న గిరిజనం1
1/3

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం ఎదురుచూస్తున్న గిరిజనం

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం  ఎదురుచూస్తున్న గిరిజనం2
2/3

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం ఎదురుచూస్తున్న గిరిజనం

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం  ఎదురుచూస్తున్న గిరిజనం3
3/3

● మూడు సెంట్ల స్థలం, ఇల్లు కోసం ఎదురుచూస్తున్న గిరిజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement