
అలుగువాగు ప్రాజెక్ట్ కాలువ పరిశీలన
ఎటపాక: మండలంలోని కన్నాపురం అలుగు వాగు ప్రాజెక్టు కాలువను చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ గురువారం పరిశీలించారు. కాలువలో పూడికతీతతో పాటు ప్రాజెక్ట్కు గేటు ఏర్పాటుచేయించాలని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మోసం కన్నా ఆధ్వర్యంలో బుధవారం ఆయకట్టుదారులు గ్రీవెన్స్లో పీవోకు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన పీవో కుసుమనపల్లిలోని కాలువను పరిశీలించారు. ఆయకట్టు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. కుడి కాలువ కోతకు గురై గండ్లు ఏర్పడటం వల్ల సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని వారు పీవోకు వివరించారు. ఈసమస్య పరిష్కారమైతే కుసుమనపల్లి, రేగడగట్టు, ఒడ్డుగుంపు, బొడ్డుగూడెం, పండువారిగూడెం, అయ్యవారిపేట, తోటపల్లి, ఎర్రబోరు గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, రైతుల సాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకువచ్చిన కన్నాను పీవో అభినందించారు. టీపీవీడు సర్పంచ్ మోసం రాజులు, రైతులు నాగేశ్వరరావు, బొజ్జయ్య, రమేష్, నాగేష్, బాబూరావు, బాలరాజు పాల్గొన్నారు.