● అబద్ధపు హామీలతో
అడవి బిడ్డలకు
అన్నం పెట్టే రైతుకుసున్నం పెట్టారు
అన్నదాతా సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20వేలు సాయం అందిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా రైతుల ఖాతాలో జమ చేయలేదు. ఈ ఏడాది కూడా జమ చేస్తారనే నమ్మకం లేదు. అమలు చేయలేని హామీలిచ్చి అధికారం చేజిక్కించుకున్నారు.
– పాంగి రాంబాబు,గిరిరైతు, శిమిలిగుడ గ్రామం, అరకులోయ
సాక్షి,పాడేరు: అబద్ధపు హామీలతో కూటమి నేతలు గిరిజనులకు వెన్నుపోటు పొడిచారు. జీవో నంబర్ 3, ప్రత్యామ్నాయ జీవో ఇలా ఎన్నో హామీలను అరకులోయ ఎన్నికల సభలో గుప్పించిన చంద్రబాబునాయుడు వాటిని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వీటితో పాటు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలను గుప్పించిన కూటమి పార్టీల నాయకులు వాటిని అమలు చేయకుండా ఏడాది పాటు కాలక్షేపం చేసేశారు. దీంతో గిరిజనులు తమ హక్కులను, చట్టాలను కాపాడుకునేందుకు ఆందోళనబాట పట్టవలసి వచ్చింది. నిరుద్యోగులు రోడ్డెక్కవలసిన పరిస్థితి దాపురించింది. ఎన్నికల ప్రచార సమయంలో.. జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోతో నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ ఖాళీలను గిరిజనులతోనే భర్తీ చేస్తామని, గిరిజన ఆశ్రమపాఠశాలల్లో హెల్త్ వలంటీర్ల నియమిస్తామని ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు పూర్తిగా విస్మరించారు.
రెండు నెలలుగా ఆందోళనలు
జీవో నంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవో తేకుండానే సీఎం చంద్రబాబు డీఎస్సీని ప్రకటించడంతో గిరిజనులకు అన్యాయం జరిగింది.నూరుశాతం ఉద్యోగాల జీవోతో పాటు,ప్రత్యేక డీఎస్సీ ప్రకటన చేస్తారని భావించిన ఆదివాసీలు చివరకు మోసపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు హామీలను విస్మరించడాన్ని నిరిసిస్తూ గత రెండు నెలలుగా గిరిజన ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. ఆదివాసీ జేఏసీ నేతలు పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల ఎదుట 18రోజుల నుంచి రిలే దీక్షలతో ఆందోళన చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు.
సూపర్ సిక్స్.. దగా ఫిక్స్
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను వంచిస్తోంది. ఏడాదికి మూడు ఉచిత సిలెండర్లు కూడా చాలామందికి అమలుకాలేదని జిల్లా వాసులు వాపోతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500,ఆర్టీసీ బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం,ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం,రైతులకు అన్నదాతా సుఖీభవ,యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి వంటి పథకాలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలజేయకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ,విద్యా,వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గ్రామాల్లో రోడ్లు,తాగునీటి పథకాల నిర్మాణాలు,గెడ్డలపై వంతెనల నిర్మాణాల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. పాఠశాలల భవనాలు,సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
తల్లులకు పంగనామం
బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం పథకంలో సాయమందిస్తామని ప్రకటించిన కూటమి నాయకులు అమలు చేయలేదు. దీంతో జిల్లాలో 1,73,887 తల్లులు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు.
ఉచిత బస్ ప్రయాణం తుస్
జిల్లాలోని 5,55,503మంది మహిళలు ఉన్నారు.వారందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చి ప్రచారం చేశారు.అయితే అధికారంలోకి ఇచ్చి ఏడాదవుతున్నా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం లేదు.
రూ.1500 ఆర్థిక సాయం వట్టిదే
18ఏళ్ల వయస్సు దాటిన మహిళలకు నెలకు రూ.1500చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన కూటమి నాయకులు అఽధికారం చేపట్టిన ఈ 12 నెలల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.జిల్లాలో 3,96,969మంది మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసింది.
ఉసూరుమంటున్న
అన్నదాతలు
నిరుద్యోగులతో ఆటలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసా అందుకున్న జిల్లాలోని 1,69,264మంది గిరిజన రైతులకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పైసా కూడా పెట్టుబడి సాయం అందించలేదు.అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఆర్థిక సాయం చేస్తామన్న కూటమి నాయకులు గత ఖరీఫ్లో ఇవ్వకపోవడంతో జిల్లాలోని పేదరైతులంతా ఉసూరుమంటున్నారు.
కూటమి ప్రభుత్వం నయ వంచన
జీవో నంబర్ 3పై నోరుమెదపని సీఎం
ప్రచార సభలో ఇచ్చిన హామీలపై
పట్టని నేతలు
రెండు నెలలుగా ఆదివాసీ ప్రజాసంఘాల ఉద్యమాలు
సూపర్ సిక్స్ హామీలు ప్రకటనలకే పరిమితం
అంతా మోసమే
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా మోసాలతో నిండిపోయింది. జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తానని అరకు సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక గిరిజనులకు మోసం చేశారు.గిరిజన ప్రాంతాలకు కూటమి పాలనలో ఒరిగిందేమి లేదు.విద్య,వైద్య రంగాల్లోను నిర్లక్ష్యం నెలకొంది.రైతుల సంక్షేమాన్ని కూడా విస్మరించారు. – పొద్దు బాలదేవ్,
గిరిజన సంఘం నేత, అరకులోయ
నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు.జిల్లాలో 2.20 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు.వారికి నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా,ఉద్యోగ,ఉపాధి అవకాశాల కల్పనలోను నిర్లక్ష్యం చూపుతున్నారు.
రైతులకు తీవ్ర అన్యాయం
సీఎం చంద్రబాబు రైతు భరోసాను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు.గత సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతి ఏటా రూ.13,500 రైతు భరోసా ఆర్థిక సాయం పొందాం.గత ఏడాది నుంచి రైతు భరోసా సాయం నిలిపివేయడంతో గిరిజ న రైతులమంతా వ్యవసాయ పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నాం.
– ముడువ కొండబాబు, గెడ్డంపుట్టు, తుంపాడ పంచాయతీ, పాడేరు మండలం
నిరుద్యోగ భృతి చెల్లించాలి
నిరుద్యోగ భృతి హామీని చంద్రబాబు నెరవేర్చాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్నా నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల హామీలు అమలు చేస్తారని యువత ఓటేస్తే కూటమి నాయకులు వంచించారు. ఇప్పటికై నా నిరుద్యోగ భృతి చెల్లించాలి. – బారికి కల్యాణ్, నిరుద్యోగి,
బోసుబెడ, అరకులోయ
ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం
గత ప్రభుత్వంలో ప్రజలకు చేసిన మంచిని ఎక్కడా కనబడకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ తన పాలనలో పేదలకు అన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తే, కూటమి ప్రభుత్వం దానికి విరుద్ధంగా పనిచేస్తోంది. వలంటీర్లను తొలగించడంతో పాటు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పేదలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇలాంటి ప్రభుత్వాలు ఎంతో కాలం కొనసాగవు. – కూడ బొంజుబాబు, రైతు,
కుమ్మరివీధి గ్రామం, పెదబయలు మండలం
మహిళలను మోసం చేశారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసింది.
– బురిడి సుమిత్ర,
గంగగుడ్డి గ్రామం, అరకులోయ
హామీ ఇచ్చి అన్యాయం చేశారు
అరకులోయలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జీవో నంబర్ 3ను పునరుద్ధరిస్తానని,ప్రత్యామ్నాయ జీవోతో నూరుశా తం ఉద్యోగాలు గిరిజనులకు క ల్పిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు పూర్తిగా విస్మరించారు. దీంతో గిరిజన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. గిరిజన ప్రత్యేక డీఎస్సీ కోసం ఉద్యమా లు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం. – రామారావుదొర,
ఆదివాసీ జేఏసీ, జిల్లా అధ్యక్షుడు, పాడేరు
రేషన్ వాహనాల రద్దుతో ఇక్కట్లు
రేషన్ వాహనాల రద్దుతో కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో భౌగోళికంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లు ఎక్కడెక్కడో ఉంటాయి. వాహన సదుపాయం అందుబాటు లేని పరిస్థితిలో జీసీసీ డిపోకు నడిచి వచ్చి రేషన్ తీసుకుని తిరిగి వెళ్లాంటే ఇబ్బందులు తప్పవు.ఏజెన్సీలో రేషన్ వాహనాలు పునరుద్ధరించాలి.
– కుంజం రామకృష్ణదొర, ఐ పోలవరం
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు
వెన్నుపోటు