ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలి

Jun 4 2025 2:20 AM | Updated on Jun 4 2025 2:20 AM

ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలి

ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలి

సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌

అరకులోయటౌన్‌: ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలని పాడేరు సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌ అన్నారు. పర్యాటక, సందర్శిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగ శిక్షణలో భాగంగా మంగళవారం స్థానిక గిరిజన మ్యూజియం ఆవరణలో యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాడేరు సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ యోగతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.వి.వి.ప్రసాద్‌, ఈవోపీఆర్‌డీ కె.వి. సత్యనారాయణ, గిరిజన మ్యూజియం, పద్మా పురం ఉద్యానవనం మేనేజర్లు మురళీ, బొంజుబాబు, వెలుగు ఏపీఎం శెట్టి కృష్ణారావు, డీటీ గోవిందు, ఆర్‌ఐ బలరామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement