
ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలి
సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్
అరకులోయటౌన్: ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొనాలని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ అన్నారు. పర్యాటక, సందర్శిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగ శిక్షణలో భాగంగా మంగళవారం స్థానిక గిరిజన మ్యూజియం ఆవరణలో యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ యోగతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.వి.వి.ప్రసాద్, ఈవోపీఆర్డీ కె.వి. సత్యనారాయణ, గిరిజన మ్యూజియం, పద్మా పురం ఉద్యానవనం మేనేజర్లు మురళీ, బొంజుబాబు, వెలుగు ఏపీఎం శెట్టి కృష్ణారావు, డీటీ గోవిందు, ఆర్ఐ బలరామ్ పాల్గొన్నారు.