
వైద్యసిబ్బంది సాహసం
నాటుపడవపై వెళ్లి గిరిజనులకు సేవలు
డుంబ్రిగుడ: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వాహనాలు వెళ్లే సౌకర్యంలేని గ్రామాల్లో వైద్యసేవలలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సాహసం చేయాల్సిందే. మత్స్యగెడ్డ అవతల ఉన్న మండలంలోని కండ్రుమ్ పంచాయతీ రాయిపాడు గ్రామానికి శనివారం స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి పి.రాంబాబు సిబ్బందితో కలిసి నాటుపడవపై వెళ్లారు. అక్కడి ప్రజలకు వైద్యసేవలందించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని గిరిజనులకు సూచించినట్టు ఆయన తెలిపారు. హెచ్వీ, హెల్త్ అసిస్టెంట్ దామోదర్, జగదీష్ పాల్గొన్నారు.