బదిలీపై వెళ్తున్నడీఈఈకి సత్కారం | - | Sakshi
Sakshi News home page

బదిలీపై వెళ్తున్నడీఈఈకి సత్కారం

Jun 1 2025 12:58 AM | Updated on Jun 1 2025 1:15 AM

బదిలీపై వెళ్తున్నడీఈఈకి సత్కారం

బదిలీపై వెళ్తున్నడీఈఈకి సత్కారం

సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌లో డీఈఈగా పనిచేసి బదిలీపై వెళ్తున్న దుర్గా శ్రీనివాసరావును శనివారం జెన్‌కో ఇంజినీర్లు ఘనంగా సన్మానించారు. జెన్‌కో అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సూపరింటెండింగ్‌ ఇంజినీరు చంద్రశేఖర్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దుర్గా శ్రీనివాసరావు విశేష సేవలందించారని చెప్పారు. సబ్‌డివిజన్‌లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. సర్కిల్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానికుల నుంచి ఎటువంటి సమస్య రాకుండా విధులు నిర్వహించారన్నారు. ఈఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడతూ ఒక మంచి అధికారి బదిలీపై వెళ్లడం బాధగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ సురేష్‌,ఈఈ రాజేంద్రప్రసాద్‌,భాస్కర్‌రావు,డీఈఈ అప్పలనాయుడు, నూతన డీఈఈ జైపాల్‌,అనుదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement