
170 కిలోల గంజాయి పట్టివేత
పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు వంతెన వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో 170 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ కొల్లి రమణ తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా నుంచి పెదబయలు మీదుగా రాజస్థాన్కు కారులో తరలిస్తూ అదే ప్రాంతానిక చెందిన రోషన్ మాలి పట్టుబడ్డారన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.8.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇదే వ్యక్తి గతంలో గంజాయిని తరలిస్తుండగా విజయనగరం జిల్లా ఎస్కోట పోలీసులు అరెస్టు చేయగా కండీషన్ బెయిల్పై విడుదలై మళ్లీ గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడని ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.