
కలమెత్తిన పాత్రికేయులు
సాక్షి,పాడేరు: ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం అన్యాయమని జర్నలిస్టు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నివాసంలోకి పోలీసులు చొరబడి భయానక వాతావరణం సృష్టించడంపై పలువురు జర్నలిస్టులు శుక్రవారం పాడేరులో నిరసన చేపట్టారు. అక్రమ సోదాలను ఖండిస్తూ స్థానిక తహసీల్దార్ వంజంగి త్రినాథరావునాయుడుకు వినతిపత్రం అందజేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. పత్రికలు, మీడియా వ్యవస్థ సంపాదకులు, జర్నలిస్ట్లపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు తాంగుల మహేశ్వరరావు, పాడేరు ప్రెస్క్లబ్ అధ్యక్షుడు,సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఎన్.ఎం.కొండబాబు, ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి, ఆర్సీ ఇన్చార్జి కె.దుర్గారావు, రూరల్ విలేకరి శెట్టి కోటేశ్వరరావు, పలు పత్రికల విలేకరులు దిలీప్, భీమరాజు పాల్గొన్నారు.
రంపచోడవరం: సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు అక్రమ సోదాలు నిర్వహించి భయానక వాతావరణం సృష్టించడంపై శుక్రవారం రంపచోడవరంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో రమణి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఆర్సీ ఇన్చార్జి జి.నారాయణరావు, విలేకరులు బి.సత్యనారాయణ, పి రాంబాబు, ప్రసన్నకుమార్, డీవీ కిరణ్, పువ్వడ బాలనారాయణ, పండు, నాగేంద్ర, డి. శ్రీను, జగన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో అక్రమ సోదాలపై మండిపాటు
కూటమి ప్రభుత్వం తీరుపై సర్వత్రా నిరసన

కలమెత్తిన పాత్రికేయులు