
క్రీడల అభివృద్ధికి చర్యలు
ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు
అరకులోయ టౌన్: జిల్లాలో క్రీడల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. డుంబ్రిగుడ మండలం అంజోడాలో ట్రైబల్ స్పోర్ట్స్ ఏర్పాటుకు కేటాయించిన 26.34 ఎకరాల స్థలంతోపాటు అరకులోని ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ను డీఎస్డీవో జగన్మోహన్రావు, స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్స్పాల్ పీఎస్ఎన్ మూర్తితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ గిరిజన క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ సహకారంతో స్పోర్ట్స్స్కూల్ నిర్మాణానికి చర్యలు చేపడతామన్నారు. క్రీడాకారులు ప్రాధాన్యమిచ్చే క్రీడలకు సంబంధించి అత్యున్నతంగా క్రీడా వసతులు కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటి ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణానికి దాతల సహకారం అవసరమన్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తలు, క్రీడా ఔత్సహికులు గిరిజన ప్రాంతంలో క్రీడా సదుపాయాల కల్పనకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కొట్యాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.