
ఐటీడీఏ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా
పాడేరు రూరల్: విద్యరంగాన్ని పరిరక్షించి, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు, శుక్రవారం స్థానిక ఐటీడీఏ ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కమిటి ప్రతినిధులు సన్యాసిరావు, రామారావు, చిట్టిబాబు మాట్లాడుతూ విద్యారంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమం అవసరమన్నారు. ప్రతీ గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులతో మోడల్ ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలన్నారు. పాఠశాలకు సంఖ్యతో సంబంధం లేకుండా ఎస్జీటీ పోస్టులు కేటాయించాలన్నారు. 6,7 తరగతులు ఉన్నచోట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలని కోరారు. తెలుగు,అంగ్ల మాద్యమాలను కొన్నసాగించాలని కోరారు. పెండింగ్లో ఉన్న 3డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే దశలవారీగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ప్రతినిధులు పోతురాజు, సత్యారావు, కన్నారావు, మంజునాథ, అద్దు, ఈశ్వరరావు, కొండబాబు, రమ్యప్రియ, స్వప్న రత్నకుమారి, పార్వతి, రాజేశ్వరి పాల్గొన్నారు.
విద్యారంగాన్ని పరిరక్షించాలని డిమాండ్
సమస్యలు పరిష్కరించకుంటే
దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరిక