
అధిక ఉష్ణోగ్రతలతో విలవిల
సాక్షి,పాడేరు: జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. శుక్రవారం భానుడు ప్రతాపం చూపడంతో జనం విలవిలలాడారు. పాడేరు, అరకు వారపు సంతలు వెలవెలబోయాయి. సంతలకు వచ్చిన గిరిజనులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. వేకువజామున చల్లదనం నెలకొంటున్నప్పటికీ సూర్యోదయం తరువాత ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం సమయానికి తీవ్రత మరింత పెరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా కూనవరంలో 39.1డిగ్రీలు, చింతూరులో 38.9డిగ్రీల ఉష్ణోగ్రతలు శుక్రవారం నమోదయ్యాయి.ఎటపాకలో 37.4, వై.రామవరంలో 37.3, మారేడుమిల్లిలో 36.4, గంగవరంలో 36, రంపచోడవరంలో 35.9, రాజవొమ్మంగిలో 35.9, పాడేరులో 35.7, కొయ్యూరులో 35.3, అడ్డతీగలలో 35, అరకులోయలో 34.5, డుంబ్రిగుడలో 33.8, ముంచంగిపుట్టులో 32.7, పెదబయలులో 32.7, చింతపల్లిలో 32, హుకుంపేటలో 31.6, అనంతగిరిలో 31.3, జి.మాడుగులలో 30.1, జీకేవీధిలో 29.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కూనవరంలో 39.1 డిగ్రీల నమోదు