
మీకోసంలో 55 వినతుల స్వీకరణ
పాడేరు రూరల్: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 55 వినతులు స్వీకరించినట్టు పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్పటేల్ తెలిపారు. శుక్రవారం ఆయన వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగవెంకట సాహిత్, డీఆర్వో కె పద్మలత, ఎస్సీఎంవీఎస్ లోకేశ్వరరావులో కలిసి అర్జీలు స్వీకరించారు. మెయిన్ రోడ్డు నుంచి గ్రామానికి సీసీ రోడ్డు నిర్మించాలని జి.మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండలరావు వినతిపత్రం అందజేశారు. భూపట్టాలో తప్పుగా నమోదైన ఇంటి పేరును సవరించాలని పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ కరనకపుట్టు గ్రామనికి చెందిన రాంబాబు అర్జీ అందజేశారు. అటవీ హక్కు పత్రాలు మంజురు చేయాలని హుకుంపేటకు చెందిన పాడి బాలన్న, తమ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ బొడంగిపాడుకు చెందిన వంతాల లక్ష్మయ్య, గొల్లోరి శ్రీను, కొర్రా సత్యరావు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్కుమార్, ఐటీడీఏ పరిపాలనాధికారి ఎం.హేమలత, తహసీల్దార్ త్రినాథరావు, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.