
దివ్యాంగులకుఉపకరణాల పంపిణీ
పాడేరు: సమాజంలో దివ్యాంగులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం సర్వశిక్షా విద్యాశాఖ ఆధ్వర్యంలో 80 మంది దివ్యాంగ చిన్నారులకు ఉపకరణాలు, బ్రెయిలీ లిపి కిట్లు, మూడు చక్రాల సైకిళ్లు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు భవిత కేంద్రాలు సందర్శిఽంచి అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలను తెలుసుకోవాలన్నారు. దివ్యాంగ పిల్లలు రోజు వారీ పనులు ఎలా చేయాలో వారికి నేర్పాలని సూచించారు. చిన్నారులకు బేస్లైన్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో బ్రహ్మాజీరావు, సర్వశిక్ష ఏపీసీ వీఏ డాక్టర్ స్వామి నాయుడు, ఐఈ కోర్డినేటర్ కె.భాస్కరరావు, విద్యాశాఖ రిసోర్స్ పర్సన్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.