
సర్టిఫికేషన్తో కాఫీ, మిరియాలకు గిట్టుబాటు ధర
జి.మాడుగుల: శ్రీ మత్స్యదేవత రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్పీవో)మాక్స్ లిమిటెడ్ రైతులకు ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్ చేయడం ద్వారా బయట మార్కెట్లో కాఫీ, మిరియాలు ఇతర ఉత్పత్తులకు మంచి ధర పొందుతారని సీఎస్ఎం సంస్థ సీఈవో అభిషేక్ జానీ తెలిపారు. మండలంలోని పెదలోచలి గ్రామంలో గురువారం మత్స్యదేవత రైతు ఉత్పత్తిదారుల సంఘం(ఎఫ్పీవో)మాక్స్ లిమిటెడ్ సీఈవో ఐసరం హనుమంతరావు, చైర్మన్ ఎం.కొండబాబు, సెంట్రల్ ఫర్ సోషల్ మార్కెట్స్ సంస్ధ(సీఎస్ఎం) ఆధ్వర్యంలో రెండోవ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎ్ఫ్పీవో ఫెయిర్ ట్రేడ్ సర్టిఫికేషన్ చేయటం ద్వారా గిట్టుబాటు ధరలు పొందవచ్చన్నారు. ఎఫ్పీవో ఫెయిర్ ట్రేడ్ ప్రీమియం కూడా పొందుతుందని సభ్యులందరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఉద్యానవన శాఖ అధికారి రమేష్కుమార్ రావు, భారతీయ చిరుధాన్యాల సంస్థ (ఐఐఎంఆర్)సీనియర్ శాస్త్రవేత్త శ్రీనివాస్బాబు, పాడేరు కాఫీ బొర్డు ఎస్.ఎల్.వో.రమేష్, స్పైసెస్ బోర్డు ప్రతినిధి మహిమ, ఎస్వీడీఎస్ కార్యదర్శి జోగినాయుడు, ఎఫ్పీవో రైతు సభ్యులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. గిరిజన రైతులకు డ్రమ్లను వారు పంపిణీ చేశారు. ఎన్ఎంఐ అయోగ్ ప్రతినిధి చైతన్యరెడ్డి, ఐఐఎంఆర్ రిప్రజేంటివ్ కె.శ్రీనివాస్, సీఎస్ఎం ఫైనాన్స్ అడ్మినిస్టేటివ్ జీఎం హరిబాబు, ఉద్యానవన శాఖ అధికారి కె.బి.కర్ణ, వీహెచ్ఎలు మాణిక్యాలరావు, బేబిరత్నం, ఎంపీఈవో మణికంఠ, పంచాయతీ కార్యదర్శి వెంకట్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సర్టిఫికేషన్తో కాఫీ, మిరియాలకు గిట్టుబాటు ధర