
ముగ్గురు హెడ్ నర్సులకు పదోన్నతులు
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల కోసం బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. హెడ్ నర్సులుగా పని చేస్తున్న ముగ్గురికి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతులు లభించాయి. డి.కవిత (రీజినల్ కంటి ఆస్పత్రి), జి.చంద్రిక (పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి), ఎం.ఇందిర (పాడేరు ప్రభుత్వ ఆస్పత్రి)లకు పోస్టింగులు ఇస్తూ వైద్యారోగ్య శాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు భవానీ తదితరులు పాల్గొన్నారు.