
కిరండూల్ రైల్వే లైన్లోడీఆర్ఎం తనిఖీలు
సాక్షి,పాడేరు: బచెలి–కిరండూల్ రైల్వే లైన్లో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్ర బుధవారం తనిఖీలు చేపట్టారు.ఈ రైల్వే లైన్లో డబ్లింగ్,మలుపుల వద్ద ట్రాక్ పనులు,వంతెనల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. కనస్ట్రక్షన్స్ చీఫ్ ఇంజనీర్ గౌరీశంకరరావు,ఇతర వాల్తేరు బ్రాంచ్ అధికారులతో కలిసి బచేలి–కిరండోల్ రైల్వే లైన్లో విండో టైలింగ్ తనిఖీలు జరిపారు.అనంతరం డీఆర్ఎం ఎన్ఎండీసీ అఽధికారులతో సమీక్షించారు.బచెలి,కిరండూల్ రైల్వే స్టేషన్లను డీఆర్ఎం తనిఖీ చేసి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు.