ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో వ్యక్తి మృతి

May 8 2025 7:51 AM | Updated on May 8 2025 7:51 AM

ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రమాదంలో వ్యక్తి మృతి

ఎటపాక: ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన మండల సరిహద్దు ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల ప్రాంతం నుంచి టిప్పర్‌లో ఇసుక రవాణా చేయించుకుని ఎటపాక మండలం మేడువాయి ప్రాంతంలో లూప్స్‌ ఇండస్ట్రీస్‌ వద్ద ఇసుకను అన్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఈ క్రమంలో లారీ గుంతలో దిగబడడంతో దానికి బయటికి తీసేందుకు భద్రాచలం నుంచి పొక్లెయినర్‌ను తీసుకువచ్చారు. దాని సాయంతో లారీని గుంత నుంచి పైకి లేపించే క్రమంలో పొక్లెయినర్‌ ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ సమయంలో పొక్లెయినర్‌ వెనక ఉన్న వాహన యజమాని పగడాల శ్రీనివాస్‌ అలియాస్‌ అంబిక వాసుకు(47) తగలడంతో అతడు జేసీబీ, గోడకు మధ్య ఇరుకున్నాడు. ఈ ప్రమాదంలో వాసుకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై బాధిత కుటుంబీకులు ఎటపాక పోలీసులకు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement